చీటీల సొమ్ము రూ.11.40 లక్షలకు టోకరా
ABN , First Publish Date - 2020-12-02T05:27:55+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంకకు చెందిన ముస్కూడి వరప్రసాద్ చీటీలతో తమ వద్ద రూ.11.40 లక్షలు కట్టించుకుని మోసం చేశాడని బోడసకుర్రు పల్లిపాలేనికి చెందిన మహిళలు అల్లవరం పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు.
- అల్లవరం పోలీస్స్టేషన్లో బాధిత మహిళల ఫిర్యాదు
అల్లవరం, డిసెంబరు 1: పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంకకు చెందిన ముస్కూడి వరప్రసాద్ చీటీలతో తమ వద్ద రూ.11.40 లక్షలు కట్టించుకుని మోసం చేశాడని బోడసకుర్రు పల్లిపాలేనికి చెందిన మహిళలు అల్లవరం పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. రెండుసార్లు పెద్దల సమక్షంలో చర్చలు జరిగాయని, కట్టించుకున్న సొమ్ము ఇవ్వలేదని బాధిత మహిళలు ఏడుగురు సెప్టెంబరులో ఫిర్యాదు చేశారు. నెలకి ఇస్తానని పోలీసుల సమక్షంలో ఒప్పుకుని మూడు నెలలు అయినా ఇవ్వలేదని మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తొమ్మిదేళ్ల పాటు గల్ఫ్లో సంపాదించిన రూ.14లక్షల సొమ్మును తన భర్త ముస్కూడి వరప్రసాద్ దుర్వినియోగం చేశాడంటూ అతడి భార్య కూడా అల్లవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను రెండో పెళ్లి చేసుకుని మోసం చేసాడంది. ఈ కేసులను దర్యాప్తు చేస్తామని అల్లవరం ఎస్ఐ బి.ప్రభాకరరావు తెలిపారు.