యువకుడి అదృశ్యంపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-10-01T08:39:02+05:30 IST

విజయవాడకు చెందిన ఓ యువకుడు అదృశ్యంపై అమలాపురం పట్టణ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు.

యువకుడి అదృశ్యంపై కేసు నమోదు

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 30: విజయవాడకు చెందిన ఓ యువకుడు అదృశ్యంపై అమలాపురం పట్టణ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు.  విజయవాడకు చెందిన యువకుడు జైన్‌ కౌశిక్‌కుమార్‌  బంగారు ఆభరణాలు తయారు చేయడం, బంగారు వస్తువులు డిజైన్‌ చేసే ఆర్డర్లు తీసుకునే పని చేస్తుంటాడు.


ఈనెల28న విజయవాడ నుంచి అమలాపురం పట్టణానికి వచ్చిన కౌశిక్‌ స్థానికంగా ఉన్న ఓ లాడ్జిలో  బస చేశాడు. ఈనెల29న ఇంటికి వస్తున్నానని ఫోన్‌చేసి చెప్పిన జైన్‌ కౌశిక్‌కుమార్‌ ఆ తర్వాత అతని ఫోన్‌ పనిచేయడం లేదు. అప్పటినుంచి అతని ఆచూకీ కోసం గాలించగా సమాచారం తెలియకపోవడంతో కౌశిక్‌కుమార్‌ చిన్నాన్న హేమేంద్ర అమలాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.   కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ బాజీలాల్‌ తెలిపారు.

Updated Date - 2020-10-01T08:39:02+05:30 IST