-
-
Home » Andhra Pradesh » East Godavari » byke rally strike
-
సమ్మె విజయవంతానికి బైక్ ర్యాలీ
ABN , First Publish Date - 2020-11-25T05:38:42+05:30 IST
మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబరు 26న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు.

భానుగుడి(కాకినాడ) నవంబరు, 24: మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబరు 26న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మికులను, ఉద్యోగులను, బానిసలుగా మార్చేందుకు ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. రైతుల నడ్డివిరిచే వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలన్నారు.