-
-
Home » Andhra Pradesh » East Godavari » books studying students
-
పుస్తక పఠనం అలవర్చుకోవాలి
ABN , First Publish Date - 2020-12-28T05:48:21+05:30 IST
విద్యార్థి దశ నుంచి పుస్తక పఠనం అలవర్చుకోవాలని చెముడులంక ఎంిపీపీ స్కూల్ హెచ్ఎం కొల్లు గోవింద్ అన్నారు.

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 27: విద్యార్థి దశ నుంచి పుస్తక పఠనం అలవర్చుకోవాలని చెముడులంక ఎంిపీపీ స్కూల్ హెచ్ఎం కొల్లు గోవింద్ అన్నారు. రాజమహేంద్రవరం ఇన్నీసుపేట శాఖ గ్రంథాలయంలో ఆదివారం జరిగిన చదవడం మాకిష్టం కార్యక్రమంలో ఆయన రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సిరిపురపు రమేష్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి పసల శివాజీలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తారని అన్ని అంశాలపైనా అవగాహన కలుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ పి.శ్రీదేవి పర్యవేక్షించారు. స్థానిక నివేదిక కిషోర్ విహార్ ఎయిడెడ్ స్కూల్లో ఉయ్ లవ్ రీడింగ్ కార్యక్రమానికి రిటైర్డ్ హెచ్ఎం కేఎస్ శాస్ర్తి ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. విద్యార్థులకు నీతికథలు చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎం బీవీ శారదాదేవి, వరాహగిరి కృష్ణమోహన్, సీఆర్పీ జయంతిశాస్త్రి, వ్యాయా మ ఉపాధ్యాయుడు జీకేఎన్వీ రమణమూర్తి పాల్గొన్నారు.