రక్తదానంతో ప్రాణదాతలు కండి: డీఎస్పీ

ABN , First Publish Date - 2020-12-01T07:05:45+05:30 IST

రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

రక్తదానంతో ప్రాణదాతలు కండి: డీఎస్పీ

బిక్కవోలు, నవంబరు 30: రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బిక్కవోలులో సోమవారం అవిశ్వాత్‌ హెల్పింగ్‌ హాండ్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లా ుతూ రక్తదానం చేసిన 60 మంది యువకులను ఆదర్శంగా తీసుకుని మరింతమంది రక్తదానం చేయాలన్నారు. ప్రశంసాపత్రాలు అందజేసారు. వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ జేవీవీ.సుబ్బారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ పోతు ల ప్రసాదరెడ్డి, బుద్దాల కన్నారావు బ్రదర్స్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ రాజీవ్‌ పాల్గొన్నారు. అంతకు ముందు డీఎస్పీ గోలింగేశ్వర, కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.



Updated Date - 2020-12-01T07:05:45+05:30 IST