సాగర తీరంలో కార్తీక సందడి
ABN , First Publish Date - 2020-11-23T06:42:14+05:30 IST
ఓడలరేవు సాగరతీరంలో ఆదివారం కార్తీకం సందడి నెలకొంది. అధిక సంఖ్యలో సందర్శకులు తీరంలో ఇసుక తిన్నెలపై సరదాగా గడిపారు.
అల్లవరం, నవంబరు 22: ఓడలరేవు సాగరతీరంలో ఆదివారం కార్తీకం సందడి నెలకొంది. అధిక సంఖ్యలో సందర్శకులు తీరంలో ఇసుక తిన్నెలపై సరదాగా గడిపారు. కుటుంబ సభ్యులు, మిత్రబృందాలతో కార్తీక సహపంక్తి భోజనాలు చేశారు. యువతీ, యువకులు సముద్రస్నానాలుచేసి ఆట, పాటలతో సరదాగా గడిపారు.
అంతర్వేది: అంతర్వేది సముద్ర తీర ప్రాంతంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. కార్తీకమాసం సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం పుణ్యక్షేత్రాలు, ఆలయాలను దర్శించారు. సాయంత్రం బీచ్లో సరదాగా గడిపారు.