‘జ్యోతుల, వరుపులపై..విమర్శలు చేయడం మానుకోవాలి’
ABN , First Publish Date - 2020-09-22T07:56:03+05:30 IST
రాజకీయంగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాల ద్వారా ప్రయోజనం పొందినవారు స్థాయిని మరచి ఆ
ఏలేశ్వరం, సెప్టెంబరు 21: రాజకీయంగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాల ద్వారా ప్రయోజనం పొందినవారు స్థాయిని మరచి ఆ నేతలపై విమర్శలు చేయడం మానుకోవాలని టీడీపీ నాయకులు అన్నారు. ఏలేశ్వరంలో జిల్లా తెలుగు యువ ఉపాధ్యక్షుడు పైల సుభా్షచంద్రబోస్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల టీడీపీ నాయకుల సమావేశం జరిగింది. బోస్తోపాటు ఏపూరి శ్రీను, సూతి బూరయ్య, కొమ్ముల కన్నబాబు మాట్లాడారు. లంపకలోవ సొసైటీలో రుణాల మంజూరుపై స్థానిక అధికారులు చేస్తున్న విచారణపై తమకు నమ్మకం లేదని, రిటైర్డ్ జడ్జి, సిట్టింగ్ జడ్డితో విచారణ నిర్వహిస్తే వరుపుల రాజాపై చేస్తున్న కుట్రలు బయటపడగలవన్నారు.
జ్యోతుల ఇటీవల చేసిన ఆరోపణలు నిజం కావని ఒప్పుకోకుండా తిరిగి తమ నాయకులపై అవినీతి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టే వైసీసీ నాయకులు జ్యోతుల సవాల్కు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో అమరాది వెంకట్రావు, మంతిన వెంకటరమణ, పసల సూరిబాబు, సతివాడ రాజేశ్వరరావు, శిడగం కన్నారావు పాల్గొన్నారు.