గుర్తుతెలియని మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2020-10-07T09:28:55+05:30 IST
ఎ.కొత్తపల్లి సమీపంలోని పంపా కాలువలో మంగళవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైందని ఎస్.ఐ రాంబాబు తెలిపారు...
తొండంగి, అక్టోబరు 6: ఎ.కొత్తపల్లి సమీపంలోని పంపా కాలువలో మంగళవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైందని ఎస్.ఐ రాంబాబు తెలిపారు. మృతుడి వయస్సు 35 ఏళ్లు ఉండొచ్చని, అతడి కుడి చేతిపై కృష్ణుని బొమ్మ, ఎన్ఆర్బీ అనే ఇంగ్లిషు అక్షరాలు ఉన్నాయన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు.