దళిత యువతి హత్యకు కారుకులను శిక్షించాలి

ABN , First Publish Date - 2020-12-25T07:16:42+05:30 IST

అనంతపురం జిల్లాలో దళిత యువతిని హత్య చేసిన దుండగులను కఠి నంగా శిక్షిం చాలని, సీఐ ప్రతాప్‌రెడ్డిని సస్పెండ్‌ చేయాలని డిమాండు చేస్తూ గురువారం రాత్రి అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయితా బత్తుల ఆనందరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వ హించారు.

దళిత యువతి హత్యకు కారుకులను శిక్షించాలి

అమలాపురం టౌన్‌, డిసెంబరు 24: అనంతపురం జిల్లాలో దళిత యువతిని హత్య చేసిన దుండగులను కఠి నంగా శిక్షిం చాలని, సీఐ ప్రతాప్‌రెడ్డిని సస్పెండ్‌ చేయాలని డిమాండు చేస్తూ గురువారం రాత్రి అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయితా బత్తుల ఆనందరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వ హించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే దళిత యువతి బలైపోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శిం చారు. పార్టీ పతాకాలు, నల్లా జెండాలతో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో టీడీపీ పార్లమెంటు జిల్లా మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, నాయకులు పొలమూరి ధర్మపాల్‌, భాస్కర్ల రామకృష్ణ, వలవల శివరావు, మాకిరెడ్డి వీఎన్‌ఎస్‌ పూర్ణిమ, మంద గెద్దయ్య, జయంతి సురేష్‌, గంపల దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-25T07:16:42+05:30 IST