బాలు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి
ABN , First Publish Date - 2020-10-01T07:40:28+05:30 IST
దేశంలో ఏ నగరానికి లేని వైభవ గీతం పాడి గోదావరి తీర ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య
గోదావరి సిటీ, సెప్టెంబరు 30: దేశంలో ఏ నగరానికి లేని వైభవ గీతం పాడి గోదావరి తీర ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని గోదావరి గట్టుపై ప్రతిష్ఠించాలని నగర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తీర్మానించింది. బుధవారం సమాఖ్య కార్యాలయంలో నగర అధ్యక్షుడు దూర్వాసుల సత్యనారాయణ అధ్యక్షతన బాలు సంతాప సభ నిర్వహించారు. బ్రాహ్మణ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాసు మాట్లాడుతూ ఆంధ్రకేసరి చిత్రంలో ఆరుద్ర రచించిన వేదంలా ఘోషించే గోదావరి పాటకు స్వరకల్పన చేసిన బాలు గోదావరి వాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
ముఖ్య అతిథి సినీ ప్రముఖుడు శ్రీపాద జిత్మోహన్ మిత్ర మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం తన తొలి కచేరీని 1972లో జాంపేటలో నిర్వహించారన్నారు. సభలో అక్షరకోటి గాయత్రి పీఠం వ్యవస్థాపకుడు సవితాల చక్రభాస్కరరావు, మల్లాది శ్రీరా మ్, బాలదినకరన్, ఆకెళ్ల ఫణి, నిడమర్తి ఉమాశంకర్పాల్గొన్నారు.