70 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం
ABN , First Publish Date - 2020-10-01T07:48:38+05:30 IST
నగరంలో తెలంగాణకు చెందిన మద్యం సీసాలు విక్రయిస్తున్న వారిపై ప్రకా్షనగర్ పోలీసులు దాడి చేసి 70 సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 30: నగరంలో తెలంగాణకు చెందిన మద్యం సీసాలు విక్రయిస్తున్న వారిపై ప్రకా్షనగర్ పోలీసులు దాడి చేసి 70 సీసాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం గాంధీపురం-3 వద్ద వాహన తనిఖీల్లో బైక్పై వెళ్తున్న అన్నపూర్ణంపేటకు చెందిన పిగౌతమ్ను పోలీసులు అదుపులోకి అతడి వద్ద 6 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
అతడిని విచారించగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా అస్వర్రావుపేటకు చెందిన నరే్షతో అక్కడి మద్యం సీసాలను అక్రమంగా రాజమహేంద్రవరం తీసుకుని వచ్చి ధవళేశ్వరానికి చెందిన సతీష్, గౌతమ్ మరో ఇద్దరు కలిసి నగరంలో అక్కడక్కడా అమ్ముతున్నారని తెలిసింది. దీంతో గౌతమ్, సతీ్షలను పోలీసులు అరెస్టు చేసి మరో 64 సీసాలు స్వాధీనం చేసుకున్నారు.