ఒక్కరోజే 1,504 కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-08-14T10:34:50+05:30 IST

కొవిడ్‌19 వైరస్‌ తన ప్రతాపం చూపుతోంది. జిల్లాలో ప్రతీ రోజూ కనిష్ఠంగా 1200కు తగ్గకుండా గరిష్ఠంగా 1300 నుంచి 1500 వరకు పాజిటివ్‌లు నమోదవు

ఒక్కరోజే 1,504 కొవిడ్‌ కేసులు

 కాకినాడలో 318, రాజమహేంద్రిలో  290 పాజిటివ్‌లు  

 తునిలో మళ్లీ 123 నమోదు  

 జిల్లాలో మొత్తం కేసులు 37,146 


కాకినాడ (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌19 వైరస్‌ తన ప్రతాపం చూపుతోంది. జిల్లాలో ప్రతీ రోజూ కనిష్ఠంగా 1200కు తగ్గకుండా గరిష్ఠంగా 1300 నుంచి 1500 వరకు పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. ఈనెల 12న సేకరించిన శ్వాబ్‌ సాంపిల్స్‌ ఫలితాల్లో 1,504 మంది వైరస్‌ బారినపడ్డారు. కాకినాడలో 318, రాజమహేంద్రవరంలో 290 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తునిలో మళ్లీ 123 కేసులు వెలుగు చూశాయి. అమలాపురంలో 74, కాకినాడ రూరల్‌లో 72 , పెద్దాపురంలో 54, రాజమహేంద్రవరం రూరల్‌లో 51 పాజిటివ్‌లు నిర్ధారణయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం ఇప్పటిదాకా 37,146 మందికి వైరస్‌ సోకింది.


మండలాల వారీగా చూస్తే.. అంబాజీపేట 7, అనపర్తి 8, బిక్కవోలు 21, గంగవరం 9, గొల్లప్రోలు 15, జగ్గంపేట 45, కాజులూరు 33,  కాట్రేనికోన 7, కిర్లంపూడి 13, కోరుకొండ 6, కొత్తపల్లి 15, మల్కిపురం 8, మామిడికుదురు 26, మండపేట 18, ముమ్మిడివరం 6, నెల్లిపాక 4, పి గన్నవరం 10, పామర్రు 5, పెదపూడి 23, పిఠాపురం 19, రాజానగరం 6, రాజవొమ్మంగి 13, రామచంద్రాపురం 21, రంపచోడవరం 8, రంగంపేట 2, రావులపాలెం 36, సామర్లకోట 19, శంఖవరం 9, సీతానగరం 3, తాళ్లరేవు 7, తొండంగి 20, ఉప్పలగుప్తం 22.

Updated Date - 2020-08-14T10:34:50+05:30 IST