కళ్యాణి డ్యామ్లో పెరుగుతోన్న నీటి మట్టం
ABN , First Publish Date - 2020-12-07T07:13:47+05:30 IST
ఎ.రంగంపేట సమీపంలోని కళ్యాణి డ్యామ్లో నీటి మట్టం పెరుగుతోంది.

నేడు గేట్లు ఎత్తే అవకాశం?
చంద్రగిరి, డిసెంబరు 6: ఎ.రంగంపేట సమీపంలోని కళ్యాణి డ్యామ్లో నీటి మట్టం పెరుగుతోంది. శేషాచలం అడవుల నుంచి వరద నీరు భారీగా చేరుతుండటంతో ఆదివారం సాయంత్రానికి 887 అడుగుల వరకు నీటిమట్టం చేరుకుంది. మరో అరడుగు నీరు చేరితే సోమవారం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దాంతో కళ్యాణి వాగు, స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి.. గేట్లు ఎత్తనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.