వరసిద్ధుడి సేవలో తెలంగాణ హైకోర్టు సీజే

ABN , First Publish Date - 2020-12-27T06:00:50+05:30 IST

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రచౌహాన్‌ కుటుంబ సమేతంగా కాణిపాక వరసిద్ధుడిని శనివారం దర్శించుకున్నారు.

వరసిద్ధుడి సేవలో తెలంగాణ హైకోర్టు సీజే
స్వామి సేవలో పాల్గొన్న తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ రాఘవేంద్రచౌహాన్‌

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 26: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రచౌహాన్‌ కుటుంబ సమేతంగా కాణిపాక వరసిద్ధుడిని శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఈవో వెంకటేశు రాజగోపురం వద్ద నుంచి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆలయ వేద ఆశీర్వాద మండపంలో వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు.   దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కస్తూరి, సీఎ్‌ఫవో నాగేశ్వరరావు, ఆర్డీవో రేణుక, తహసీల్దార్‌ బెన్నురాజ, సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, కిషోర్‌కుమార్‌రెడ్డి, కాణిపాకం ఎస్‌ఐ మనోహర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T06:00:50+05:30 IST