క్రిస్టియన్ రక్షణ వేదిక కార్యాలయం ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-27T06:53:17+05:30 IST
క్రిస్టియన్ రక్షణ వేదిక కార్యాలయం ప్రారంభం
చిత్తూరు, అక్టోబరు 26: దుర్గానగర్కాలనీలోని సీఎంఎస్ఎస్ఎస్ కార్యాలయ ఆవరణలో సోమవారం ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ రక్షణ వేదిక కార్యాలయాన్ని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఎంఎస్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చర్చిల నిర్మాణాలకు రూ.10-15 లక్షల వరకు నిధులను మంజూరు చేస్తుందన్నారు. అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అంతకుముందు వేదిక నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పీటర్, ఉపాధ్యక్షులుగా మహిమదాస్, సెక్రటరీగా షాడ్రక్, జాయింట్ సెక్రటరీగా భాస్కర్రావు, కోశాధికారిగా రమేష్ ప్రసాద్, అడ్వయిజర్లుగా జోబ్, రాబర్ట్, మెంబర్లుగా కిరణ్, సత్యరాజ్, ప్రభుతాస్, విజయ్లను ఎన్నుకున్నారు.