తిరుమల : జీయంగార్లకు ముగిసిన వైద్య పరీక్షలు
ABN , First Publish Date - 2020-07-19T02:25:03+05:30 IST
తిరుమల ఆలయ పెద్ద జీయంగార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

తిరుమల : తిరుమల ఆలయ పెద్ద జీయంగార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. కొద్దిసేపటి క్రితమే జీయంగార్కు వైద్య పరీక్షలు ముగిశాయి. దీంతో స్విమ్స్ నుంచి జీయంగార్లను మఠానికి తరలించడానికి లైన్ క్లియర్ అయ్యింది. పరీక్షలు ముగియడంతో జీయంగార్లు తరలింపుకు వైద్యులు అనుమతించారు. మరికాసేపట్లో తిరుపతిలోని పెద్ద జీయంగార్లు మఠానికి పెద్ద, చిన్నజియ్యంగార్లు చేరుకోనున్నారు. మఠంలోనే జీయంగార్లు చాతుర్మాస దీక్ష కోనసాగించనున్నారు. జీయంగార్లను అపోలో, టీటీడీ ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షించనున్నది. జీయర్లకు సేవలందించడానికి శిష్య బృందం సిద్ధమైంది. కాసేపట్లో తరలించనుండటంతో మఠం వీధిలో రాకపోకలను పోలీసులు బంద్ చేశారు.