ముగిసిన టీచర్ల బదిలీ వెబ్ ఆప్షన్ గడువు
ABN , First Publish Date - 2020-12-19T06:30:16+05:30 IST
టీచర్ల బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్ గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగిసినట్లు డీఈవో నరసింహారెడ్డి తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 18: టీచర్ల బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్ గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగిసినట్లు డీఈవో నరసింహారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఆప్షన్ నమోదు చేసుకోనివారు ఈనెల 21, 22 తేదీల్లో ఎంఈవో కార్యాలయాలను సంప్రదించాలన్నారు. అక్కడే 30వ తేదీలోపు వెబ్ ఆప్షన్ సబ్మిట్ చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు.