ఏపీ ఈసెట్‌ పరీక్షలకు ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2020-09-12T05:33:32+05:30 IST

ఏపీఈసెట్‌ రాసే అభ్యర్థుల సౌకర్యార్థం తిరుపతి సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ నుంచి ఇయాన్‌ డిజిటల్‌ పరీక్ష కేంద్రానికి ప్రత్యేక

ఏపీ ఈసెట్‌ పరీక్షలకు ప్రత్యేక బస్సులు

తిరుపతి (రవాణా), సెప్టెంబరు 11: ఏపీఈసెట్‌ రాసే అభ్యర్థుల సౌకర్యార్థం తిరుపతి సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ నుంచి ఇయాన్‌ డిజిటల్‌ పరీక్ష కేంద్రానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14న ఈ పరీక్ష జరగనుంది. కాగా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు, తిరుగు ప్రయాణం కోసం మధ్యాహ్నం 12, సాయంత్రం 6 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. కాగా, వెంకటగిరి గంగమ్మజాతర సందర్భంగా నిలిపివేసిన ఆర్టీసీ బస్సుల రాకపోకలను తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభించామన్నారు. 

Updated Date - 2020-09-12T05:33:32+05:30 IST