నేటి నుంచి ఒంటి పూట బడులు
ABN , First Publish Date - 2020-03-16T11:15:10+05:30 IST
నేటి నుంచి ఒంటి పూట బడులు
చిత్తూరు సెంట్రల్, మార్చి 15: జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఏప్రిల్ 23వ తేదీవరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో.. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు జరగనున్నాయి.