మూతపడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు రీస్టార్ట్ ప్యాకేజీ
ABN , First Publish Date - 2020-06-18T11:08:15+05:30 IST
లాక్డౌన్ అమలుతో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించినట్లు కలెక్టర్ భరత్గుప్తా తెలిపారు.

కలెక్టర్ భరత్గుప్తా
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 17: లాక్డౌన్ అమలుతో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించినట్లు కలెక్టర్ భరత్గుప్తా తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో డిస్ర్టిక్ట్ ఇండస్ర్టీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు విద్యుత్తు, స్థిర, డిమాండ్ చార్జీలను మాఫీ చేయడం జరుగుతుందన్నారు.
కాపిటల్లో 20శాతం పూచీకత్తులేని రుణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. త్వరలో ఏర్పాటయ్యే 27 భారీ, మెగా పరిశ్రమల ఏర్పాటుతో జిల్లాలో 44,887 మంది ఉపాధి పొందుతారన్నారు. 48 ఎంఎ్సఎంఈల ద్వారా 752 మంది ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. ట్రైనీ కలెక్టర్ విష్ణుచరణ్, జేసీ-2 చంద్రమౌళి, డీఐసీ జీఎం ప్రతా్పరెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఐ.ఎల్.రామ్ పాల్గొన్నారు.