అతివేగానికి నిండు ప్రాణం బలి

ABN , First Publish Date - 2020-12-02T05:23:43+05:30 IST

ఒక తప్పు మరో తప్పునకు దారి తీసింది. అది నిండు ప్రాణాన్నే బలిగొంది.

అతివేగానికి నిండు ప్రాణం బలి
బాబు (ఫైల్‌ఫోటో)

యాదమరి, డిసెంబరు 1: ఒక తప్పు మరో తప్పునకు దారి తీసింది. అది నిండు ప్రాణాన్నే బలిగొంది. స్థానికుల కథనం మేరకు.. ఆటోలో గ్రామాల్లో తిరుగుతూ పాతసామాన్లు కొనే ఒక వ్యక్తి మంగళవారం సాయంత్రం ఆటోతో బుడితిరెడ్డిపల్లె వద్ద పొలం చుట్టూ వేసిన స్తంభాల్ని గుద్దేశాడు. దీంతో వారు ఎక్కడ పట్టుకుంటారో అని ఆటో నిలపకుండా వేగంగా వస్తూ వరదరాజులపల్లె వద్ద ఎదురుగా ద్విచక్ర వాహనంలో వస్తున్న గుట్టకిందవూరుకు చెందిన బాబు (42)ను ఢీకొన్నాడు. బాబుకు తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. బాబును స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తి అని ఇతడు చిత్తూరులోని ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్నాడని సమచారం. 

Updated Date - 2020-12-02T05:23:43+05:30 IST