టీచర్ల బదిలీల వెబ్ ఆప్షన్లకు నేటితో గడువు పూర్తి
ABN , First Publish Date - 2020-12-15T05:52:17+05:30 IST
చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ స్థానాల ఎంపికకు సంబంధించిన గడువు మంగళవారంతో ముగియనుంది.
చిత్తూరు(సెంట్రల్), డిసెంబరు 14: టీచర్ల బదిలీలకు సంబంధించి వెబ్ఆప్షన్ల ఎంపిక గడువు మంగళవారంతో ముగియనుంది. ఆ మేరకు.. జిల్లావ్యాప్తంగా 6004 ఖాళీలుండగా, 2851 ఖాళీలను విద్యాశాఖ ఉన్నతాధికారులు బ్లాక్ చేశారు. దీంతో 3153 ఖాళీలను క్లియర్ వేకెన్సీగా చూపడంతో, ఒకేప్రాంతంలో 8ఏళ్లుగా పనిచేస్తున్న 2858 మంది తప్పనిసరిగా బదిలీలు పొందన్నారు. వీరితోపాటు బదిలీలకు పోటీ పడుతున్న 5003 మంది టీచర్లకు బదిలీ కావాల్సిన స్థానం ఎంపికకు విద్యాశాఖ యంత్రాంగం అవకాశం ఇచ్చింది. బుధవారం నుంచి బదిలీ ఆర్డర్ల జాబితా ప్రదర్శన, 22, 23న వీటిపై అభ్యంతరాల స్వీకరణకు అధికారులు అవకాశం ఇచ్చారు.