కాణిపాక హుండీ ఆదాయం రూ. 75.60 లక్షలు
ABN , First Publish Date - 2020-12-30T06:13:16+05:30 IST
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 75 లక్షల 60 వేల 931 లభించినట్లు ఈవో వెంకటేశు తెలిపారు.

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 29: స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 75 లక్షల 60 వేల 931 లభించినట్లు ఈవో వెంకటేశు తెలిపారు. మంగళవారం ఆలయ ఆస్థాన మండపంలో స్వామి కానుకలను ఈవో పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది లెక్కించారు. నగదుతో పాటు 64 గ్రాముల బంగారు, 750 గ్రాముల వెండి, 4 యూఎ్సఏ, 2 సింగపూర్ డాలర్లు, 5 యూఏఈ దీర్హామ్స్, 20 ఇంగ్లాడు పౌండ్లు లభించినట్లు ఈవో తెలిపారు. ఆలయానికి 19 రోజుల్లో ఈ ఆదాయం సమకూరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, ఏఈవోలు చిట్టెమ్మ, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, సీఎ్ఫవో నాగేశ్వరరావు, సూపరింటెండెంట్లు ప్రసాద్, కోదండపాణి, శ్రీధర్బాబు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.