రోడ్డెక్కిన అంతర్రాష్ట్ర ప్రైవేటు బస్సులు
ABN , First Publish Date - 2020-09-12T05:35:41+05:30 IST
రోడ్డెక్కిన అంతర్రాష్ట్ర ప్రైవేటు బస్సులు

కలికిరి, సెప్టెంబరు 11: అంతర్రాష్ట్ర సర్వీసులకు పర్మిట్లున్న ప్రైవేటు బస్సులు శుక్రవారం నుంచి రోడ్డెక్కాయి. కరోనా కారణంగా గత మార్చి 21వ తేదీ నుంచి నిలిచిపోయిన ఈ సర్వీసులను దాదాపు ఆరు నెలల తరువాత పునరుద్ధరించారు. బస్సులన్నీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన అనుమతులున్నవే. తమిళనాడు వేలూరుకు గౌసియా, కర్ణాటకకు సీఎంటీ, భారతి, ఎంఎం, జయపద్మ సర్వీసులు యథాతథంగా పాత వేళలతోనే నడుస్తున్నాయి.