హట్సన్ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి
ABN , First Publish Date - 2020-08-22T11:52:01+05:30 IST
హట్సన్ డెయిరీలో అమ్మోనియం లీకేజీతో అస్వస్థతకు గురైన బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వామపక్షాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు రూ.15 లక్షల
చిత్తూరు రూరల్/తిరుపతి (ఆటోనగర్), ఆగస్టు 21: హట్సన్ డెయిరీలో అమ్మోనియం లీకేజీతో అస్వస్థతకు గురైన బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వామపక్షాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు రూ.15 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని, ఘటనకు విచారణకు ఆదేశించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చల్లా వెంకయ్య, సీఐటీయూసీ జిల్లా కార్యదర్శి చైతన్య డిమాండ్ చేశారు.
చికిత్స పొందుతున్న బాధితులను సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగరాజన్, ఇతర నాయకులు పరామర్శించారు. గ్యాస్ లీకేజీ బాధితులకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి డిమాండ్ చేశారు.