హోమ్ క్వారంటైన్ బాధితులను పరామర్శించాలి
ABN , First Publish Date - 2020-08-14T08:56:37+05:30 IST
కరోనా కారణంగా హోమ్ క్వారంటైన్లో చికిత్స పొందుతున్న బాధితులను రోజూ సంబంధిత ఏఎన్ఎంలు పరామర్శించి ధైర్యం చెప్పాలని మేడి
కలికిరి, ఆగస్టు 13: కరోనా కారణంగా హోమ్ క్వారంటైన్లో చికిత్స పొందుతున్న బాధితులను రోజూ సంబంధిత ఏఎన్ఎంలు పరామర్శించి ధైర్యం చెప్పాలని మేడికుర్తి వైద్యాధికారి డా.చిన్నరెడ్డెప్ప ఆదేశించారు. గురువారం జరిగిన సమావేశంలో పీహెచ్సీలోని సూపర్వైజర్లు, హెల్త్ ఎడ్యుకేటర్లు రోజూ కొంత మంది చొప్పున బాధిత కుటుంబీకులతోనూ మాట్లాడాలని సూచించారు. సమయానికి తీసుకోవాల్సిన మందులు, ఆహారం గురించి విచారించాలన్నారు. ఆశ కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలన్నారు.