జేసీఐ జోన్‌-4 అధ్యక్షుడిగా హర్షవర్ధన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-14T05:09:08+05:30 IST

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దాసరపల్లెకు చెందిన హర్షవర్ధన్‌రెడ్డి జేసీఐ జోన్‌-4 అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

జేసీఐ జోన్‌-4 అధ్యక్షుడిగా హర్షవర్ధన్‌రెడ్డి
హర్షవర్ధన్‌రెడ్డి

పెనుమూరు, డిసెంబరు 13: జూనియర్‌ చాంబర్‌ ఇంటర్నేషనల్‌(జేసీఐ) జోన్‌-4 అధ్యక్షుడిగా మండలంలోని దాసరపల్లెకు చెందిన ఎన్‌.బి.హర్షవర్ధన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 11న విశాఖపట్నం గ్రీన్‌పార్క్‌ హోటల్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఎంపిక ఏకగ్రీవమైంది. కాగా, ఏడాది పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. హర్షవర్ధన్‌ తండ్రి ఎన్బీ సుధాకర్‌రెడ్డి తిరుపతిలో సైకాలజిస్టుగా సేవలందిస్తున్నారు. 

Updated Date - 2020-12-14T05:09:08+05:30 IST