గంగమ్మకు అంబళ్ల సమర్పణ
ABN , First Publish Date - 2020-05-10T08:11:43+05:30 IST
చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరలో భాగంగా శనివారం వైభవంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు.
![గంగమ్మకు అంబళ్ల సమర్పణ](https://media.andhrajyothy.com/appimg/galleries/2020051001410/05102020024135n13.jpg)
చిత్తూరు కల్చరల్, మే 9: చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరలో భాగంగా శనివారం వైభవంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరప్రజలు ఇళ్లలోనే గంగమ్మకు నైవేద్యంగా అంబళ్ళు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇళ్లను వేపాకు తోరణాలతో అలంకరించి ముత్తయిదువుల సమక్షంలో సుమంగళి పూజ చేశారు.