భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం
ABN , First Publish Date - 2020-08-03T10:37:32+05:30 IST
పుత్తూరు ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి తిరుణాళ్లలో భాగంగా ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం జరిగింది. స్థానిక మంచినీళ్లగుంట ..
పుత్తూరుటౌన్, ఆగస్టు 2: పుత్తూరు ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి తిరుణాళ్లలో భాగంగా ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం జరిగింది. స్థానిక మంచినీళ్లగుంట వద్ద భక్తులు స్నానాలు ఆచరించి పసుపు, గంధం పుష్పాలంకరణ చేసుకుని గోవింద నామస్మరణతో అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ లారీ మోహన్, ఉభయదారులు, పుత్తూరు శల్య వైద్యులు ప్రకాష్రాజు, ధనంజయలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ప్రతాప్రాజు తదితరులు వహించారు.