నరహరిపేట చెక్‌పోస్ట్‌ డీసీటీవోపై విచారణకు ఆదేశాలు

ABN , First Publish Date - 2020-11-13T05:50:11+05:30 IST

నరహరిపేట చెక్‌పో్‌స్టలో పనిచేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ డీసీటీవోతో సహా మరో నలుగురిపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నరహరిపేట చెక్‌పోస్ట్‌ డీసీటీవోపై విచారణకు ఆదేశాలు

కలికిరి, నవంబరు 12: నరహరిపేట చెక్‌పో్‌స్టలో పనిచేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ డీసీటీవోతో సహా మరో నలుగురిపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు విచారణాధికారికి సహకరించడానికి ప్రెజెంటింగ్‌ అధికారిని కూడా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2014 జూలై 27న నరహరిపేట చెక్‌పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో పనిచేస్తున్న డీసీటీవోతోపాటు మరో నలుగురు సిబ్బంది అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి వీరంతా తమ వైపు సంజాయిషీలను సమర్పించుకున్నారు. ఈ సంజాయిషీలతో సంతృప్తి చెందని ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించడానికి గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు విచారణ కమిషన్‌కు సహకరించడానికి మరో ప్రెజెంటింగ్‌ అధికారిని కూడా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2020-11-13T05:50:11+05:30 IST