పీఆర్ఎస్ఐ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక
ABN , First Publish Date - 2020-12-21T05:27:09+05:30 IST
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) అధ్యక్ష, కార్యదర్శులుగా కె.శ్రీనివాసరావు, దుద్యాల చంద్రమోహన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తిరుపతి(కల్చరల్), డిసెంబరు 20: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) అధ్యక్ష, కార్యదర్శులుగా కె.శ్రీనివాసరావు, దుద్యాల చంద్రమోహన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా జీఎస్ ప్రసాద్, సహాయ కార్యదర్శిగా సాయికుమార్రెడ్డి, కోశాధికారిగా చక్రవర్తి రాఘవన్, సభ్యులుగా త్రిపుర సుందరి, ఆర్సీకే రాజు, చంద్రమోహన్రావు, రాజేష్ ఎన్నికయ్యారని తిరుపతి చాప్టర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సి.రమాకాంత శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య సలహాదారులుగా టీటీడీ పీఆర్వో రవి, ప్రముఖ సైకాలజిస్ట్ ఎన్బీ సుధాకర్రెడ్డి, పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి వ్యవహరిస్తారు.