మోదీని కాకాపట్టడంలో జగన్ దిట్ట: నారాయణ

ABN , First Publish Date - 2020-11-22T17:37:08+05:30 IST

మోదీకి జగన్ భజనపరుడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు.

మోదీని కాకాపట్టడంలో జగన్ దిట్ట: నారాయణ

తిరుపతి: మోదీకి జగన్ భజనపరుడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేంద్రాన్ని జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మోదీని కాకాపట్టడంలో జగన్ దిట్ట అని అన్నారు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా  సీఎంలో మార్పు రాదా అని ప్రశ్నించారు. పోలవరంలోకి కమ్యూనిస్టులను  అనుమతించాలన్నారు. పోలవరంకు వెళుతున్న వారిని ఎందుకు నిర్భంధిస్తున్నారని ఆయన మండిపడ్డారు.


బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఓడి గెలిచిందని...గెలుపు కోసం మోదీ ఎంతటికైనా దిగజారుతున్నాడని దుయ్యబటబ్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమయ్యే విధంగా ప్రధాని నిర్ణయాలు ఉన్నాయన్నారు. కార్పొరేట్ కంపెనీల కోసమే మోదీ ప్రధానిగా పనిచేస్తున్నారా..? అని నిలదీశారు. వామపక్షాలన్నీ ఒక్కటై..ఎర్రజెండాలు పట్టుకుని ముందుకు సాగుదామని... మోదీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిద్దామని  పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్, కేటీఆర్‌లు ఇంకా ఎన్నిసార్లు  మోసం చేస్తుంటారని మండిపడ్డారు. తిరుపతి ఉపఎన్నికల్లో సీపీఐ పోటీ చేయదని నారాయణ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-11-22T17:37:08+05:30 IST