ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్లో 63మందికి స్పాట్ అడ్మిషన్లు
ABN , First Publish Date - 2020-12-11T06:43:43+05:30 IST
ఎస్వీ ప్రభుత్వ పాలి టెక్నిక్లో గురువారం నిర్వహించిన పాలిసెట్ స్పాట్ అడ్మిషన్లలో 63 మందికి ప్రవేశం కల్పించినట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ జగదీశ్వరుడు తెలిపారు.
తిరుపతి (విద్య), డిసెంబరు 10: తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలి టెక్నిక్లో గురువారం నిర్వహించిన పాలిసెట్ స్పాట్ అడ్మిషన్లలో 63 మందికి ప్రవేశం కల్పించినట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ జగదీశ్వరుడు తెలిపారు. తమ కళాశాలలో 160 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా సివిల్లో 8, మెకాని కల్లో 2, బయో మెడికల్లో 15, కెమికల్ ఇంజనీరింగ్లో 38మంది చొప్పున 63మందికి ప్రవేశాలు కల్పించామన్నారు. అన్ని విభాగాల్లో సీట్లు భర్తీకాగా కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో పది సీట్లు మిగిలాయని చెప్పారు. అడ్మిషన్స్ ఇన్ఛార్జి గల్లా కృష్ణమూర్తి నాయుడు, అధికారులు బోసుబాబు, ఆర్వీ రమణకుమార్, బాలకృష్ణ, హర్షవర్ధన్, సాయిరాజేష్, మునిమోహన్, అజయ్కుమార్, పీఆర్వో ఆనందరావు పాల్గొన్నారు.