వాటర్‌ ప్లాంట్‌కు కరెంటు కట్‌

ABN , First Publish Date - 2020-12-25T06:47:27+05:30 IST

యాక్షన్‌కు రియాక్షన్‌ అన్న చందంగా వి డపనకల్లు విద్యుత్‌, పంచాయతీ శాఖల మధ్య కోల్డ్‌వార్‌ మొదలైంది. స్థాని క పంచాయతీ వాటర్‌ ప్లాంట్‌కు ఆరు నెలలుగా విద్యుత్‌ బిల్లు చెలించలేదు. దీంతో విద్యుత్‌ అధికారులు రెండురోజుల క్రితం వాటర్‌ ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారు.

వాటర్‌ ప్లాంట్‌కు కరెంటు కట్‌

ప్రతీకారంగా విద్యుత్‌ కార్యాలయానికి నీటిసరఫరా బంద్‌

విడపనకల్లు, డిసెంబరు 24: యాక్షన్‌కు రియాక్షన్‌ అన్న చందంగా వి డపనకల్లు విద్యుత్‌, పంచాయతీ శాఖల మధ్య కోల్డ్‌వార్‌ మొదలైంది. స్థాని క పంచాయతీ వాటర్‌ ప్లాంట్‌కు ఆరు నెలలుగా విద్యుత్‌ బిల్లు చెలించలేదు. దీంతో విద్యుత్‌ అధికారులు రెండురోజుల క్రితం వాటర్‌ ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వాటర్‌ ప్లాంట్‌ నిర్వాహకులు పశువైద్యశాల నుంచి విద్యుత్‌ను తీసుకుని నెలనెలా విద్యుత్‌ బిల్లులు చెల్లించేవారు.  వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆరు నెలలుగా ఎటువంటి విద్యుత్‌ బిల్లు చెల్లించకుండా అక్రమంగా విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకుని వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు. ఎన్నిసార్లు విద్యుత్‌ బిల్లు కోసం పంచాయతీ అధికారులకు తెలిపినా పట్టించులేదన్నారు. దీంతో రెండు రోజుల క్రితం సరఫరాను నిలిపి వేసినట్లు విద్యుత్‌ అధికారులు తెలియజేశారు. దీనిపై పంచాయతీ అధికారులు ఆగ్రహంతో ఊగిపోయారు. గురువారం ఉదయం విద్యుత్‌ కార్యాలయానికి నీటి సరఫరాను బంద్‌ చేశారు. 



Updated Date - 2020-12-25T06:47:27+05:30 IST