వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పదస్థితిలో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-11-13T06:23:57+05:30 IST

వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పదస్థితిలో గురువారం ఇద్దరు మృతి చెందారు. గుడిబండ మండలంలో కర్ణాటకకు చెందిన జీవన్‌కుమార్‌ మృతి చెందాడు. అమరాపురం మండలం హలుకూరుకు చెందిన జయమ్మ కూలీ పనికి వెళ్లి వక్కతోటలో మృతి చెందింది.

వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పదస్థితిలో ఇద్దరి మృతి

వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పదస్థితిలో గురువారం ఇద్దరు మృతి చెందారు. గుడిబండ మండలంలో కర్ణాటకకు చెందిన జీవన్‌కుమార్‌ మృతి చెందాడు. అమరాపురం మండలం హలుకూరుకు చెందిన జయమ్మ కూలీ పనికి వెళ్లి వక్కతోటలో మృతి చెందింది. 


గుడిబండ, నవంబరు 12: మండల కేంద్రం సమీపంలో కర్ణాట క ప్రాంతానికి చెందిన జీవన్‌కుమార్‌(25) అనే వ్యక్తి అనుమానాస్ప దస్థితిలో మృతి చెందాడు. పోలీసులు అందంచిన మేరకు వివ రాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం సామరాయపాళ్యంకు చెందిన జీవ న్‌కుమార్‌ బెంగళూరులోని ఓ పెట్రోల్‌ బంకులో పనిచేసేవాడని కరోనా కారణంగా గుడిబండకు వచ్చి ఇక్కడేఉన్నాడని అన్నారు.  గు రువారం గుడిబండలో అపస్మారక స్థితిలో పడి ఉన్న సమయంలో స్థానికులు 108కు సమాచారం అందించారని అప్పటికే జీవన్‌కుమార్‌ మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


అమరాపురం: మండలంలోని హలుకూ రు గ్రామానికి చెందిన జయమ్మ(45) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వక్కతోటలో కూలీపనికి వెళ్లి అక్కడే మృతి చెందడంతో తోట యజ మాని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కు టుంబ సభ్యులు అందించిన ఫిర్యాదు మేరకు అ నుమానాస్పద స్థితి లో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2020-11-13T06:23:57+05:30 IST