నేడు ఏపీఈసెట్-2020 పరీక్ష
ABN , First Publish Date - 2020-09-14T09:36:02+05:30 IST
పాలిటెక్నిక్ అనంతరం ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈసెట్-2020 పరీక్ష సోమవారం ..
జిల్లాలో 6 పరీక్ష కేంద్రాలు
జేఎన్టీయూ, సెప్టెంబరు 13: పాలిటెక్నిక్ అనంతరం ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈసెట్-2020 పరీక్ష సోమవారం జరగనుంది. పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ భానుమూర్తి తెలిపారు. 14 కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు రాష్ట్రవాప్తంగా 37167 దరఖాస్తులు వచ్చాయన్నారు.
అత్యధికంగా మెకానికల్ ఇంజనీరింగ్కు 11247 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా బయోటెక్నాలజీకి 3 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. పరీక్ష రెండు సెషన్స్లో జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి 6 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. రాష్ట్రవాప్తంగా 79 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, జిల్లాలో ఆరింటిలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 744 మంది, మధ్యాహ్నం 733 మంది పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు.