పది పరీక్షలు మళ్లీ వాయిదా

ABN , First Publish Date - 2020-03-25T11:13:31+05:30 IST

పదో తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. గతంలో స్థానికసంస్థల ఎన్నికల కారణంగా వాయిదా వేస్తే.. ఈసారి కరోనా ప్రభావంతో వాయిదా వేయడం విశేషం.

పది పరీక్షలు మళ్లీ వాయిదా

అనంతపురం విద్య, మార్చి 22: పదో తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. గతంలో స్థానికసంస్థల ఎన్నికల కారణంగా వాయిదా వేస్తే.. ఈసారి కరోనా ప్రభావంతో వాయిదా వేయడం విశేషం. రెండువారాల పాటు పరీక్షలను వాయి దా వేస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌(డీజీఈ) సుబ్బారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే తదుపరి పరీక్షల షెడ్యూల్‌ ఈనెల 31వ తేదీ ప్రకటిస్తామన్నారు. దీంతో టెన్త్‌ పరీక్షలు రెండుసార్లు వాయిదా పడినట్లయింది.

Updated Date - 2020-03-25T11:13:31+05:30 IST