శింగనమలలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత
ABN , First Publish Date - 2020-05-29T10:19:00+05:30 IST
జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు భగ్గుమంటుండగా... గురువారం అత్యధికంగా శింగనమలలో 42.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ..

బుక్కరాయసముద్రం, మే 28: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు భగ్గుమంటుండగా... గురువారం అత్యధికంగా శింగనమలలో 42.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. యల్లనూరులో 42.1, యాడికి 41.7, గార్లదిన్నె, పెద్దపప్పూరు 40.9, కళ్యాణదుర్గం, పామిడి 40.8, బుక్కరాయసముద్రం, పుట్లూరు 40.7, గుత్తి 40.6, అనంతపురం 40.1, రొళ్ల 37.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాస్త్రవేత్త సాదినేని మల్లీశ్వరీ తెలిపారు.