యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-30T06:41:28+05:30 IST
మండంలోని కొండూరు గ్రామానికి చెందిన గోడెన్నగారి రంగప్ప, పద్మక్కల కుమారుడు శ్రీనివాసులు(23) చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందాడు.

లేపాక్షి, డిసెంబరు 29 : మండంలోని కొండూరు గ్రామానికి చెందిన గోడెన్నగారి రంగప్ప, పద్మక్కల కుమారుడు శ్రీనివాసులు(23) చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందాడు. ఉదయం ఎద్దులు తోలుకుని చేనువద్దకు వెళ్లి చేనువద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే సరి గా ఏడాదిక్రితం ఇదేరోజు తన ప్రాణస్నేహితుడు హరీ బావిలో మోటారు తీయడానికి వెళ్లి నీటిలో మునిగి చనిపోయాడు. వీరిద్దరు ప్రాణస్నేహితులుగా ఉండేవారని గ్రామస్థులు తెలిపారు. ఒకే రోజు ఏడాదిక్రితం ఇ లా చనిపోవడంతో గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలా ల్సి ఉంది.