త్వరితగతిన కాలువ మరమ్మతులు: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-09-22T07:58:31+05:30 IST
ఎంపీఆర్ దక్షిణ కాలువకు మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి, ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ
గార్లదిన్నె, సెప్టెంబరు 21: ఎంపీఆర్ దక్షిణ కాలువకు మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి, ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. సోమవారం సా యంత్రం హెచ్చెల్సీ దక్షిణ కాలువను, ఎంపీఆర్ను ఆమె సందర్శించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీఆర్ నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమలో కన్వీనర్ సుధాకర్రెడ్డి, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి నరేంద్రరెడ్డి, నాయకులు ఈశ్వరయ్య, రామచంద్రారెడ్డి, నాగలింగారెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
పుట్లూరు: మండలంలోని మడుగుపల్లి, జంగంరెడ్డిపేట, ఎల్లుట్ల గ్రామాల్లో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు నేలకొరిగిన అరటితోటలను ఎమ్మెల్యే పద్మావతి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ నష్టపోయిన రైతుల జాబితా సిద్ధం చేసి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు వెంకట్రామిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, ఉద్యానవనశాఖ అధికారులు ఉన్నారు.