ప్రసవానికి వెళ్తే రూ.లక్ష డిమాండా?
ABN , First Publish Date - 2020-08-09T10:31:06+05:30 IST
ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే రూ.లక్ష డిమాండ్ చేయటం ఏంటని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్యుల తీరుపై ఎమ్మెల్సీ ఆగ్రహం
హిందూపురం టౌన్, ఆగస్టు 8: ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే రూ.లక్ష డిమాండ్ చేయటం ఏంటని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులు ప్రసవం కోసం మొదట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళుతున్నారు. అక్కడి సిబ్బంది ఇక్కడ కొవిడ్ ప్రభావం ఉందంటూ వారిని నిర్ధాక్షిణ్యంగా ప్రైవేట్ ఆస్పత్రులకు పంపుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు సిజేరియన్ కోసం రూ.లక్ష డిమాండ్ చేస్తున్నాయి. వి షయం తెలుసుకున్న ఎమ్మెల్సీ.. వైద్యుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు మానవతాదృక్పథంతో పని చేయాల్సిందిపోయి.. కాసుల కోసం కక్కుర్తి పడటం బాధాకరమన్నారు. దీనిపై వైద్యశాఖ కమిషనర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తానన్నారు.