సర్వజనాస్పత్రి నిర్మానుష్యం
ABN , First Publish Date - 2020-03-23T09:53:02+05:30 IST
నిరంతరం సందడిగా ఉండే జిల్లా సర్వజనాస్ప త్రి జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆది వారం నిర్మానుష్యంగా మారింది.
![సర్వజనాస్పత్రి నిర్మానుష్యం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020032304183288/03232020042301n44.jpg)
జనతా కర్ఫ్యూతో రోగులు దూరం
ఇన్పేషెంట్లకే పరిమితం
అనంతపురం వైద్యం, మార్చి 22: నిరంతరం సందడిగా ఉండే జిల్లా సర్వజనాస్ప త్రి జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆది వారం నిర్మానుష్యంగా మారింది. విధులకు వైద్యులు హాజరైనా రోగులు లేక ఆయా వార్డుల్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నారు. ఇన్పేషెంట్లకు మాత్రమే వైద్య సేవలందించారు. సూపరింటెండెంట్ రా మస్వామినాయక్, ఆర్ఎంఓలు ఆస్పత్రిలో ఉంటూ కరోనా కేసులు తదితర చర్యల గురించి చర్చిస్తూ బిజీగా కనిపించారు.