మందలిస్తారని భయపడి విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-02-08T11:50:20+05:30 IST

తల్లిదండ్రులు దండిస్తారన్న భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హిందూపురంలో శుక్రవారం జరిగింది.

మందలిస్తారని భయపడి విద్యార్థి ఆత్మహత్య

హిందూపురం టౌన్‌, ఫిబ్రవరి 7 : తల్లిదండ్రులు దండిస్తారన్న భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హిందూపురంలో శుక్రవారం జరిగింది.  త్యా గరాజ్‌ నగర్‌లో నివాసమున్న దేవి, నాగరాజుల కుమారు డు లోకేష్‌ చెర్లోపల్లి వద్ద 10వ తరగతి చదువుతున్నాడు.  విద్యార్థి కొద్దిరోజులుగా గుట్కా నములుతుండటాన్ని గమ నించిన ఉపాధ్యాయుడు మందలించాడు.

ఈ విషయాన్ని  విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపాడు. అయితే తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి ట్యూషన్‌కు వెళ్తానని గురు వారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే శుక్ర వారం ఉ దయం 10గంటల సమయంలో నర్సాపురం రైల్వే బ్రిడ్జివద్ద శవమై కనిపించాడు. స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థి ఆచూకీ కనుగొన్నారు. మృతదే హాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవ పంచనామా అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.  

Updated Date - 2020-02-08T11:50:20+05:30 IST