-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Electricity bill issued as Rs149 lakhs
-
కరెంట్ బిల్లు రూ. 1.49 లక్షలు రావడంతో కూలీ మహిళ షాక్
ABN , First Publish Date - 2020-12-19T06:46:03+05:30 IST
ఫొటోలో కనిపిస్తున్న ఈమె పేరు కురుబ కామాక్షమ్మ. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో నివాస ముంటోంది

కణేకల్లు, డిసెంబరు 18 : ఫొటోలో కనిపిస్తున్న ఈమె పేరు కురుబ కామాక్షమ్మ. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో నివాస ముంటోంది. కూలీనాలీ చేసుకొని జీవనం సాగిస్తున్న ఈమెకు, విద్యుత్ అధికారులు కరెంటు బిల్లు రూపంలో షాకిచ్చారు. డిసెంబరు నెల కరెంటు బిల్లు ఏకంగా రూ.1,49,034 జారీ చేశారు. ప్రతి నెలా కేవలం రూ.వంద దా టని బిల్లు.. ఉన్నఫలంగా రూ.లక్ష దాటిస్తూ ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి ఖంగుతింది. తాను జీవితాంతం చెల్లించినా ఇంత కరెంటు బిల్లు రా దని, కేవలం ఒక నెలకు మాత్రమే ఇంత పెద్దమొత్తంలో బిల్లు వేశారని వి స్మయానికి గురైంది. కూలీనాలీ పనులు చేసుకుని జీవించే కామాక్షమ్మకు ఇంత పెద్దమొత్తంలో కరెంటు బిల్లు రావడంతో ఎలా చెల్లించాలో తెలియక విద్యుత్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఈ విషయంపై స్థానిక ఇన్చార్జి విద్యుత్ ఏఈ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా, సాంకేతిక సమస్య కారణంగానే ఇలాంటి తప్పిదం చోటు చేసుకుందని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె వినియోగించిన యూనిట్ల మేరకే విద్యుత్ బిల్లు వ చ్చేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా మండల వ్యాప్తంగా పలువురు వినియోగదారులు ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.