-
-
Home » Andhra Pradesh » Ananthapuram » devadaya
-
దేవదాయ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి: యువమోర్చా
ABN , First Publish Date - 2020-12-15T06:15:56+05:30 IST
రాష్ట్ర దేవదాయశా ఖ మంత్రి వెలంపల్లి శ్రీనివా్సను మంత్రివర్గం నుంచి బ ర్తరఫ్ చేయాలని బీజేపీ యువమోర్చా జిల్లా కార్యదర్శి గంగాధర్యాదవ్ డిమాండ్ చేశారు.

తాడిపత్రి టౌన, డిసెంబరు 14: రాష్ట్ర దేవదాయశా ఖ మంత్రి వెలంపల్లి శ్రీనివా్సను మంత్రివర్గం నుంచి బ ర్తరఫ్ చేయాలని బీజేపీ యువమోర్చా జిల్లా కార్యదర్శి గంగాధర్యాదవ్ డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. అన్యమత ప్రార్థనా మందిరాల సంరక్షణ, నూతన ప్రార్థనా మందిరాలు నిర్మిస్తామని మంత్రి ప్రకటన చేయటం విడ్డూరంగా ఉందన్నారు. దేవదాయశాఖ ద్వారా ఏ పనులు చేయాలో మంత్రి తెలుసుకోవాలని హితవుపలికారు. సమావేశంలో నాయకులు రవితేజ, పవనకుమార్, సతీష్ పాల్గొన్నారు.
రాయదుర్గం రూరల్: ప్రభుత్వ నిధులతో చర్చిలు, మసీదులు నిర్మిస్తామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొనడం సమంజసం కాదని విశ్వహిం దూ పరిషత జిల్లా కార్యఅధ్యక్షుడు రామనాథం ఖండిం చారు. సోమవారం స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మసీదు లు, చర్చిలు మంత్రి సొంత నిధులతో నిర్మించుకుంటే అభ్యంతరం లేదన్నారు. సమావేశంలో నాయకులు సిద్ద ప్ప, రామలింగయ్య, హనుమప్ప, భీమరాజు తదితరు లు పాల్గొన్నారు.