కరోనా ప్రభావంతో కుదేలైన టమోటా రైతన్న
ABN , First Publish Date - 2020-04-01T09:46:15+05:30 IST
మండలంలోని జౌకల గ్రామానికి చెం దిన రైతు బాలక్రిష్ణారెడ్డి తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో టమోటా సాగు చేశాడు. పంట ఆశాజనకంగా వచ్చింది.

నంబులపూలకుంట, మార్చి 31 : మండలంలోని జౌకల గ్రామానికి చెం దిన రైతు బాలక్రిష్ణారెడ్డి తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో టమోటా సాగు చేశాడు. పంట ఆశాజనకంగా వచ్చింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో పండిన పంటను మార్కెట్కు తరలించడానికి వీలు లేక పోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మార్కెట్కు తరలించే అవకాశం లేక పోవడంతో పంటను కోసి పొలంలోనే ఉంచినట్లు రైతు తెలిపాడు. చెన్నై మార్కెట్కు తరలించడానికి ప్రయత్నించగా, తమిళనాడు రాష్ట్రంలోకి వా హనాలు అనుమతించడం లేదన్నాడు. మదనపల్లి మార్కెట్లో వ్యాపారు లు 30 కిలోల టమోటా బుట్టను రూ. 40కి అడుగుతున్నట్లు తెలిపారు. ఈ ధరలకు విక్రయిస్తే కనీసం కూలీల డబ్బులు కూడా చేతికి అందవని అంటున్నాడు. ప్రభుత్వం టమోటా రైతును ఆదుకోవాలని రైతు కోరాడు.