25లోపు నాడు-నేడు పనులు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-07-11T10:35:46+05:30 IST
జిల్లాలో మనబడి నాడు-నేడు పనులన్నింటినీ ఈ నెల 25లోపు పూర్తి చేయాలని సం బంధిత అధికారులను జిల్లా
అధికారులకు కలెక్టర్ ఆదేశం
అనంతపురం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మనబడి నాడు-నేడు పనులన్నింటినీ ఈ నెల 25లోపు పూర్తి చేయాలని సం బంధిత అధికారులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం ఆయ న కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. నాడు-నేడు పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా నాడు-నేడు పనులకు సంబంధించి 84 శా తం నిధులు ఖర్చు చేసినందుకు ఎంఈఓలు, హెచ్ఎంలు, ఇంజనీర్లు సంబంధిత అధికారులను కలెక్టర్ అభినందించారు.
ఈ నెల 17లోపు వందశాతం ఖర్చు చేయాలని సూచించారు. 2009 పాఠశాలలు పునాది స్థాయికి చేరుకో లేదన్నారు. వాటన్నింటికీ పునాదులు వేసి పనులు ప్రారం భించాలన్నారు. అలా చేయని వారిపై చర్యలకు వెనకాడ బోనని హెచ్చరించారు. రెండు మండలాల్లో మరుగుదొడ్లు, విద్యుదీకరణ, ప్రహరీలు, తాగునీటి పనులు మందకొడిగా సాగుతున్నాయన్నారు. వారంతా నిర్దేశిత గడువులోగా పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. డీఈఓ శామ్యూల్ జిల్లాలో నాడు-నేడు పనుల పురోగతిని వివరించారు. కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్, ఏపీసీ రవూఫ్, ఈఈ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.