రైతు భరోసా, నివర్‌ తుఫాను నష్టపరిహారం విడుదల

ABN , First Publish Date - 2020-12-30T06:11:17+05:30 IST

జిల్లాలో నివర్‌ తుఫానుతో నష్టపోయిన రై తాంగానికి పరిహారంతోపాటు రైతు భరోసా సొమ్ము విడుదలైనట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆ నిధులను వి డుదల చేశారు.

రైతు భరోసా, నివర్‌ తుఫాను నష్టపరిహారం విడుదల

5,846 మంది రైతులకు రూ.4.06 కోట్ల రైతు భరోసా

3484 మందికి రూ.2.57 కోట్ల నష్టపరిహారం

కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నివర్‌ తుఫానుతో నష్టపోయిన రై తాంగానికి పరిహారంతోపాటు రైతు భరోసా సొమ్ము విడుదలైనట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆ నిధులను వి డుదల చేశారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌తోపాటు ఎంపీ తలా రి రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, జేసీ నిశాంత్‌కుమార్‌ హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రైతు భరోసా ద్వారా 5846 మంది రైతులకు రూ.4.06 కోట్ల లబ్ధిట చేకూరిందన్నారు. నివర్‌ తుఫాను కారణంగా పంట నష్టపోయిన 3484 మంది రైతులకు రూ.2.57 కోట్ల నష్టపరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. గత రెండు విడత ల్లో రైతు భరోసా పొందని 5123 మంది ఒ క్కొక్కరికి రూ.7500 చొప్పున మొత్తం రూ.3.84 కోట్లు, 723 మంది కౌలు రైతులకు రూ.21.93 లక్షలు విడుదల చేసిందన్నారు. అ నంతరం రూ.4.06 కోట్ల రైతు భరోసా చెక్కు ను రైతులకు అందజేశారు.




Updated Date - 2020-12-30T06:11:17+05:30 IST