కరోనా తీవ్రతపై ఎమ్మెల్సీతో చంద్రబాబు ఆరా

ABN , First Publish Date - 2020-04-09T10:42:42+05:30 IST

జిల్లాతో పాటు, మడకశిర ప్రాంతంలో కరోనా తీవ్రతపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్‌ ద్వారా ఎమ్మెల్సీ గుండుమల

కరోనా తీవ్రతపై ఎమ్మెల్సీతో చంద్రబాబు ఆరా

మడకశిర టౌన్‌, ఏప్రిల్‌ 8: జిల్లాతో పాటు, మడకశిర ప్రాంతంలో కరోనా తీవ్రతపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్‌ ద్వారా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో ఆరాతీశారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రాంతాల వారీగా చంద్రబాబు సమా చారాన్ని సేకరిస్తున్నారు.


అందులో భాగంగా మడకశిర ప్రాంతంలో కరోనా ప్రభావం ఏ మేర ఉంది, లాక్‌డౌన్‌తో ప్రజలు ప డుతున్న ఇబ్బందులు, కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఎమ్మెల్సీని అడిగి తెలుసుకున్నారు. రైతులు, కార్మికులు, ప్ర జల ఇబ్బందులపై ప్రత్యేకంగా సమాచారం సేకరించారు. కరోనాను అరికట్టేందుకు ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించేలా కృషి చేయాలని పిలుపునిచ్చినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.

Updated Date - 2020-04-09T10:42:42+05:30 IST