పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ
ABN , First Publish Date - 2020-12-13T05:30:00+05:30 IST
పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ

బెలగాం : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం పార్వతీపురం పట్టణంలో మనం - మన పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ వై.నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.వంశీకృష్ణ, ఎన్ఎస్ఎస్ పీవోలు టి.రవికుమార్, రమణ, తవిటినాయుడు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ సీతానగరం : పెదభోగిలి పంచాయతీలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్య నిర్వహణ అధికారి జి.వెంకట రమణ, కార్యదర్శి సుధారాణి, వలంటీర్లు, రైతులు పాల్గొన్నారు.